Sunday, April 28, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో ఐటీ ఉద్యోగి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ స్నేహితుడైన ఐటీ ఉద్యోగి నర్సింగరావును సిట్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. నర్సింగరావు ఐటీ సంస్థ విప్రోలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు ప్రవీణ్ నుంచి ఎఇఇ పేపర్‌ను ఆయన పొందినట్లు సిట్ అధికారులు గుర్తించారు. డబ్బు తీసుకోకుండానే అతనికి ప్రవీణ్ పేపర్ ఇచ్చినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 44కి చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News