Thursday, May 2, 2024

నవ్వులు పంచే ‘జాతిరత్నాలు’

- Advertisement -
- Advertisement -

Jathi Ratnalu movie release on Mar 11

 

నవీన్ పోలిశెట్టి,- రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం ’జాతిరత్నాలు’. అనుదీప్ కె.వి. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో దర్శకుడు నాగ్‌అశ్విన్ నిర్మాతగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భగా ఈనెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘జాతిరత్నాలు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై సినిమా బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం నాగ్ అశ్విన్. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చేసేటప్పుడు చిన్న చిన్న రోల్స్ ఇచ్చేవాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో కొట్లాడి మరీ రోల్ ఇచ్చాడు. ఇప్పుడు నాగ్‌అశ్విన్ నిర్మాతగా చేసిన ‘జాతి రత్నాలు’ చూసి ఎంజాయ్ చేయండి”అని అన్నారు. నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ “రాహుల్, దర్శి, రధన్, ఫరియా.. కొన్ని సినిమాలు అలా కలిసి వస్తాయి.

నవీన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి పాత్రలు చేసినా వాటికి తగ్గట్టు ఉంటాడు. ఏజెంట్ పాత్ర చేస్తే ఏజెంట్‌లా.. జోగిపేట కుర్రాడిలా.. ఇలా ఏ పాత్ర చేసినా అలానే కనిపిస్తాడు. ఇక ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే చిత్రం జాతిరత్నాలు”అని తెలిపారు. నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ “ఇది యూత్ సినిమా. పోస్టర్‌లో జాతి రత్నాలు అంటే మేము కనిపిస్తున్నాం. కానీ నాగ్ అశ్విన్, స్వప్నా, ప్రియాంక అసలు రత్నాలు. ఇక ప్రేక్షకులకు నవ్వును పంచేందుకు ఈనెల 11న ‘జాతిరత్నాలు’తో మేము వస్తున్నాము”అని చెప్పారు. దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ “నాగ్ అశ్విన్‌కు కథ చెప్పిన తరువాత ఫుల్ చిల్లరగాళ్లు కావాలని అన్నాడు. ముందు నవీన్ పేరు చెప్పాను.. తరువాత రాహుల్, దర్శి పేర్లు చెప్పాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News