హైదరాబాద్ : నగరంలో నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఈనెల 13న మల్లేపల్లి జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్కుమార్ తెలిపారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఆశ్రిత్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేటు కంపెనీలో పనిచేయుటకు దాదాపు 120 కారు డ్రైవర్ ఉద్యోగాల ఎంపికకు మేళా జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్దులు పదవతరగతితో పాటు కారు డ్రైవింగ్ లైసెన్స్లు కలిగి ఉండాలని, దూర ప్రాంతాలకు చెందిన వారికి ఫుడ్, ఆకామిడేషన్ ఉంటుందన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 12వేలు నుంచి రూ.18వేల వరకు వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్దుల వయస్సు 23నుంచి 35 సంవత్సరాలు ఉన్న పురుషులు మాత్రమే అర్హులన్నారు. అర్హత ఆసక్తిగల నిరుద్యోగులు తమ బయోడేటాతో పాటు విద్యార్హతల కాఫీల జీరాక్స్లతో 13వ తేదీ గురువారం విజయనగర్ కాలనీ, మల్లేపల్లి, బాలరు ఐటిఐ క్యాంపస్ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో 10.30 గంటలకు జరుగు జాబ్మేళాకు హాజరు కావాలని కోరారు.