జో బైడెన్, పెన్స్కు త్వరలోనే బహిరంగంగా కరోనా టీకా
వాషింగ్టన్: కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అతి త్వరలో కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోనున్నారు. వచ్చే వారం మొదట్లో బైడెన్ బహిరంగంగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటారని, పెన్స్ ఆయన భార్య కరెన్ కూడా శుక్రవారం బహిరంగంగా టీకా తీసుకుంటారని తమ పేర్లను వెల్లడించడానికి ఇష్టపడని ఇద్దరు అమెరికన్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ను ఆలస్యం చేయకుండా తొందరలోనే వేసుకోవాలని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసి తనకు సూచించనట్లు బైడెన్ మంగళవారం మీడియాకు తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ను దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం ప్రారంభించే సమయంలో దీన్ని ముందుగా ఫ్రంట్ లైన్ వైద్య ఆరోగ్య సిబ్బందికి, వృద్ధులకు ఆందచేయాలన్నదే తన ప్రాధాన్యతని ఆయన చెప్పారు. అయితే, అమెరికా పౌరులులో వ్యాక్సిన్ పట్ల ధైర్యాన్ని నింపడానికి తాను బహిరంగంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవలసి అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఫ్రంట్లైన్ వారియర్స్ను పక్కనపెట్టి ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడం తన అభిమతం కాదని, అయితే..ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదన్న విశ్వాసాన్ని ప్రజలలో కల్పించవలసిన బాధ్యత తనపైన ఉందని బైడెన్ చెప్పారు.