Tuesday, June 24, 2025

ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతోందట

- Advertisement -
- Advertisement -

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, స్టార్ హీరో – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న డ్రాగన్ సినిమా పై రోజుకొక వార్త వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతోందట. మార్షల్ ఆర్ట్ నేపథ్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. పైగా ఈ సినిమాకే కాకుండా, ఎన్టీఆర్ సినీ కెరీర్‌లోనే ఈ సీక్వెన్స్ హైలెట్‌గా నిలిచిపోతుందని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమైతే, ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా ఎప్పటికీ స్పెషల్‌గా నిలిచిపోతుందని చెప్పవచ్చు. బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించటంలో మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తనదైన స్టైల్లో ఎన్టీఆర్‌ను ఇప్పటి వరకు ఎవరూ వెండితెరపై చూపించని విధంగా సరికొత్త మాస్ అవతార్‌లో చూపించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News