- Advertisement -
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. 18 ఏళ్ల పాటు కాంగ్రెస్లో కొనసాగి, వివిధ పదవులను అనుభవించిన సింధియా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమైన అనంతరం మంగళవారం కాంగ్రెస్కు రాజీనామా చేశారు. సింధియా రాజీనామా దరిమిలా మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కూడా తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి కమల్నాథ్ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమైంది.
Jyotiraditya Scindia Joins in BJP
- Advertisement -