Thursday, May 2, 2024

ఆదిత్య థాక్రేపై కంగనా సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -
- Advertisement -

Kangana Ranaut sensational comments on Aditya Thackeray

ముంబై:బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ శివసేనపై మరోసారి విరుచుకుపడింది. అంతేకాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రేపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు విచారణలో బాలీవుడ్ లో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో కంగనా పలువురు బాలీవుడ్ ప్రముఖలు డ్రగ్స్ వాడుతారని ట్వీట్ చేసింది. అయితే, బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ తో ఆదిత్య థాక్రేకు కూడా సంబంధాలున్నాయని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. మరోవైపు తన కార్యాలయం కూల్చివేతతో కంగనా, శివసేనకు మధ్య వివాదం నెలకొంది. దీంతో కంగనా ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ ను కలిసి కూల్చివేతపై ఫిర్యాదు చేసింది. ఈ వివాదంలో బిజెపి కంగనాకు మద్దతుగా నిలువడంతో సిఎం ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు.

Kangana Ranaut sensational comments on Aditya Thackeray

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News