Saturday, April 27, 2024

‘కథా కేళి’ చిత్రీకరణ పూర్తి

- Advertisement -
- Advertisement -

దర్శకుడు సతీశ్ వేగేశ్న ‘కథా కేళి’ చిత్రంతో తన కొడుకు యశ్విన్‌ను హీరోగా లాంచ్ చేయబోతోన్నారు. చింతా గోపాలకృష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ టీజర్‌ను దిల్ రాజు విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చింది.

సతీశ్ వేగేశ్న ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేశారు. చిత్ర యూనిట్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసింది. సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ఇక చివరి రోజున చిత్రయూనిట్ సభ్యులు అంతా కూడా సందడిగా కనిపించారు. ఈ మేరకు మేకర్స్ షేర్ చేసిన ఫోటోల్లో చిత్రయూనిట్ అంతా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News