Friday, April 26, 2024

కట్టంగూరులో కారు బోల్తా: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై కట్టంగూరు శివారులో ఎరసాని గూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తా పడడంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Three Members dead in Car accident

మృతులు ఎండి ఇద్దాక్ (21) ఎస్ కే.సమీర్ (21) ఎస్ కే.యాసీన్ (18)  ఖమ్మం వాసులుగా గుర్తించారు. హైదరాబాదు నుండి ఖమ్మం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హైదరాబాదులో వలీమా ఫంక్షన్ కు హాజరై తిరిగి సొంతూరుకు వెళుతుండగా  ఇన్నోవా కారు బోల్తా పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతులంతా ఖమ్మం జిల్లా బాఘా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News