Saturday, April 27, 2024

విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతాం

- Advertisement -
- Advertisement -

విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతాం
రూ.719.30 కోట్లతో స్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచాం
త్వరలోనే విజయవాడ టు సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైళ్లు
వాటిని తిరుపతి వరకు పొడిగించాలని రైల్వే మంత్రిని కోరాం
సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణపై సమీక్ష జరిపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.719.30 కోట్లతో స్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ రైల్వేస్టేషన్‌గా దీనిని తీర్చిదిద్దుతామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణపై నిర్వహించిన సమీక్షలో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఈ సమీక్షలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్‌కుమాజైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ టు సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైళ్లు రాబోతున్నాయని తిరుపతి వరకు వందే భారత్ రైళ్లు పొడిగించాలని ప్రధానిని, రైల్వే మంత్రిని కోరామని కిషన్‌రెడ్డి తెలిపారు. 1,300 కి.మీ మేర కొత్త లైన్ల కోసం భూసేకరణ జరుగుతోందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంలను పూర్తిగా ఆధునీకరిస్తాం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంలను పూర్తిగా ఆధునీకరిస్తామని పార్కింగ్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. 26 ఆధునిక లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని, విమానాశ్రయం తరహాలో రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతామన్నారు. మూడు దశల్లో, 36 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. కాజీపేటలో రూ.384 కోట్లతో ఇన్ వ్యాగన్ వర్క్‌షాప్ కోసం టెండర్లు పిలిచామని, 150 ఎకరాల్లో భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు రాష్ట్రం నిధులు ఇవ్వాలని కిషన్‌రెడ్డి కోరారు. రాష్ట్రం నిధులు విడుదల చేస్తే పనులు త్వరగా పూర్తవుతాయన్నారు.

Kishan Reddy review on Secunderabad Railway Station

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News