Tuesday, April 30, 2024

అప్పట్లో ఎంతో కుంగిపోయా

- Advertisement -
- Advertisement -

Kohli says 2014 England series will remain Nightmare

 

ముంబై: తన కెరీర్‌లోనే 2014 ఇంగ్లండ్ సిరీస్ ఓ పీడకలగా మిగిలిపోతుందని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో తన బ్యాటింగ్ వైఫల్యాలు ఎంతో బాధకు గురి చేశాయన్నాడు. ఆ సిరీస్ తర్వాత తాను ఎంతో కుంగుబాటుకు గురయ్యానని వివరించాడు. సిరీస్ అనంతరం స్వదేశానికి వచ్చిన తానుఎంతో ఒంటరిగా ఫీలయ్యానని వాపోయాడు. ఆ వైఫల్యాలు తలచుకుని ఎంతో బాధకు గురయ్యే వాడినని కోహ్లి తెలిపాడు. ఆ సమయంలో తాను పడిన మనో వేదన మాటల్లోవర్ణించలేనన్నాడు. ఆ వైఫల్యాలు తనను చాలా రోజులు పాటు వెంటాయన్నాడు. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం ఒకవైపు, తనబ్యాటింగ్ వైఫల్యం మరోవైపు తనను ఎంతో కుంగుబాటుకు గురి చేశాయన్నాడు. అయితే ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో పరుగుల వరద పారించడంతో దాని నుంచి బయటపడ్డానని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో కోహ్లి వెల్లడించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News