కొత్తగూడెం భద్రాద్రి: భద్రాద్రి రామయ్యను భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మీ తయారు అమ్మవారి ఉపాలయంలో వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి ప్రసాదాన్ని వెంకట్ రెడ్డికి ఇఒ అందించారు. అనంతరం కుటుంబ సమేతంగా నిత్య కళ్యాణ వేడుకలో ఎంపి కోమటిరెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -