Monday, April 29, 2024

సహస్రాబ్ది మహోత్సవాలకు జగన్‌ను ఆహ్వనించిన చినజీయర్‌..

- Advertisement -
- Advertisement -

అమరావతి: త్రిదండి చినజీయర్‌ స్వామి ఎపి ముఖ్యమంత్రి నివాసంలో సిఎం వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సిఎం వైఎస్‌ జగన్‌ను చినజీయర్‌ స్వామి ఆహ్వనించారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సహస్రాబ్ది ఉత్సవాల జరుగనున్నాయి. ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా, చినజీయర్‌ స్వామితో పాటు టిటిడి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మైహోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు ముఖ్యమంత్రిని కలిశారు.

Chinna Jeeyar Swamy meets AP CM Jagan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News