Saturday, May 4, 2024

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన విద్యావేత్త చుక్కా రామయ్య..

- Advertisement -
- Advertisement -

Green India Challenge: Chukka Ramaiah plant saplings

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మొక్కలు నాటారు. శనివారం తన 97వ పుట్టిన రోజు సందర్భంగా విద్యానగర్ లోని తన నివాసంలో ప్రముఖ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, కె.రామచంద్రమూర్తితో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చుక్కా రామయ్య మొక్కలు నాటారు. దీంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచిన చుక్కా రామయ్యకు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి, కృతజ్ఞతలు తెలిపారు.

Green India Challenge: Chukka Ramaiah plant saplings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News