జగద్గిరిగుట్ట/నిజాంపేట: స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ 105 వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జగద్గిరిగుట్టలోని మార్కండేయ స్వామి మందిరంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్, సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణలు పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట పద్మశాలి సంఘం నాయకులు మునిపల్లి జనార్ధన్, గూడూరి లక్ష్మీ నర్సింహులు, సత్యరాజు, ఎం.అనంతరాములు, గడ్డం జయరాములు, ఏనుగంటి శ్రీనివాస్, ఎం.ప్రభాకర్, అల్లి యాదగిరి, ఆర్. రవీందర్, పెంట సత్యనారాయణ, కొడిపాకరాజు, దండే రమేష్, బోడ దత్తాత్రి, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
చింతల్లో….
చింతల్ డివిజన్ పరిధిలోని ఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు బేతి గోపాల్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.జనార్ధన్, వై.హరినారాయణ,గుదే రాజశేఖర్, జల్దా లక్ష్మీనాథ్, బాలునేత, అప్పారావు, పెండెం నాగభూషణం, అవధూత గోపాల్, జయరాములు, లక్ష్మీ నర్సింహులు, పలువురు పద్మశాలి కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు.
గాజులరామారంలో..
గాజులరామారం డివిజన్ పరిధిలోని గాజులరామారంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి టిఆర్ఎస్ నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు విజయరామిరెడ్డి, నాయకులు పున్నారెడ్డి, కస్తూరి బాల్రాజు, రషీద్బేగ్, సాయిప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
konda laxman bapuji jayanthi 2020