Tuesday, May 7, 2024

పదవి రాగానే ఫ్లైట్ లో వచ్చి మాట్లాడుతున్నారు: కోరుకంటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ నేత మధుయాష్కీకి పదవి రాగానే అమెరికా నుంచి ఫ్లైట్ లో వచ్చి మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కోరుకంటి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల లక్ష్యంగా కనిపిస్తోందని, ఎన్ని అవాంతరాలు అడ్డువచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని,  ఇప్పుడు కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా దళితబంధు పథకం ఆగదన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దళితుల పై చేసిన విమర్శలపై దళితులు కన్నెర్ర చేస్తున్నారని,  దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకం బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కెసిఆర్ కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని కోరుకంటి ఎద్దేవా చేశారు.  ప్రజా పథకాలను అడ్డుకుంటే ప్రజలు ప్రతిపక్షాలను రోడ్లెక్కనివ్వరని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News