Tuesday, April 30, 2024

హై వోల్టేజ్ మాస్ సాంగ్..

- Advertisement -
- Advertisement -

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీస్థాయిలో నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి క్లాసికల్ చిత్రాలను అందించిన హీరో, దర్శకుడు కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘గుంటూరు కారం’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. చిత్ర బృందం ఇప్పటికే దమ్ మసాలా, హే బేబీ అనే రెండు పాటలను, అలాగే మునుపెన్నడూ లేని విధంగా మహేష్ బాబు మాస్ అవతార్‌ను పరిచయం చేస్తూ టీజర్ ను విడుదల చేసింది.

సంక్రాంతి పండుగకు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున రమణ గాడి రుబాబు ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ప్రముఖ స్వరకర్త ఎస్‌ఎస్ థమన్ ఈ చిత్రానికి పాటలు సమకూర్చారు. ఇప్పుడు చిత్రబృందం మూడో పాటగా హై వోల్టేజ్ మాస్ నంబర్ ‘కుర్చీ మడతపెట్టి‘ని విడుదల చేసింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను మరింత మాస్‌గా, ఎనర్జిటిక్‌గా చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఈ పాటను విడుదల చేసింది. ఈ పాటలో అదిరిపోయే బీట్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో మనం వినే జానపద శైలి సాహిత్యం ఉన్నాయి.

సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. యువ అందాల తార శ్రీలీల ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. మహేష్ బాబుతో కలిసి ఆమె వేసిన డ్యాన్స్ స్టెప్పులు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. ఈ స్టెప్పులకు థియేటర్లు ఖచ్చితంగా షేక్ అవుతాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో కథానాయికగా నటిస్తోంది. గుంటూరు కారం చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News