Sunday, April 28, 2024

సిఎం బ్రేక్ ఫాస్ట్ తో 20 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: మానవీయ కోణంలో ఆలోచించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు  గొప్ప కార్యక్రమం ప్రారంబించారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రావిర్యాల జిల్లా పరిషత్ హైస్కూల్ లో సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంబించారు.  ఈ పథకం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, 20 లక్షల విద్యార్థుల తల్లిదండ్రుల తరుపున సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలకు పౌష్ఠికాహారం అందిస్తున్నామని, దేశంలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క
రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు.

సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకం విద్య వ్యవస్థలో సమూల మార్పు తీసుకవస్తుందని, సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న అన్ని పథకాలు సూపర్ హిట్ గా మారాయని, సిఎం కెసిఆర్ ఒక పథకం అమలు చేసే ముందు ప్రజా కోణంలో ఆలోచిస్తారని, అందుకే అవి విజయవంతం అవుతున్నాయని, సామాజిక మార్పుకు కారణం అవుతున్నాయని హరీష్ రావు కొనియాడారు. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, కళ్యాణ లక్ష్మి రూ.లక్ష ఇచ్చే పథకం మాత్రమే కాదని, కళ్యాణ లక్ష్మి బాల్య వివాహాలను తగ్గించిందని, చట్టాలు చేయలేనిది పథకం చేసిందని హరీష్ రావు ప్రశంసించారు.

కెసిఅర్ కిట్ 16 వస్తువులు ఇచ్చే పథకం మాత్రమే కాదని, కెసిఅర్ కిట్ వల్ల వంద శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు జరుగుతున్నాయని వివరించారు. మిషన్ భగీరథ అంటే ఇంటింటికీ నాల్లాలు మాత్రమే కాదని, మిషన్ భగీరథ వల్ల సురక్షిత తాగునీరు అందుతున్నదని, తద్వారా సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. ఇప్పుడు కెసిఅర్ బ్రేక్ ఫాస్ట్ కేవలం విద్యార్థుల కడుపు నింపే కార్యక్రమం మాత్రమే కాదని, స్కూల్స్ లో డ్రాప్ ఔట్స్ తగ్గించి, బడి బాట పట్టించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకవచ్చామని హరీష్ రావు తెలియజేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు దేశంలో మనం మాత్రమే భోజనం అందిస్తున్నామని, ఇంగ్లీష్ మీడియంలో చదువు చెబుతున్నామని, 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మెచ్చుకున్నారు. ఆడపిల్లల కోసం ప్రత్యేక విద్యాలయాలు ప్రారంభించామని, దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు అవుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపిలు పాటిల్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎడ్యుకేషన్‌, వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి, విద్యా శాఖ సెక్రటరీ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News