Friday, June 20, 2025

టిడిపి పగ్గాలు ఆ ఇద్దరికి అప్పగించాలి: లక్ష్మీ పార్వతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో సెల్ఫ్‌డబ్బా తప్ప అభివృద్ధి శూన్యమని వైసిపి నేత లక్ష్మీ పార్వతి తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పుత్రుడు, దత్తపుత్రుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరిగినా ప్రజలు నమ్మరని, టిడిపి నేత లోకేష్‌ను ఎన్‌టిఆర్ మనవడిగా ప్రజలు రిసీవ్ చేసుకోవడంలేదన్నారు. టిడిపిని నందమూరి కుటుంబానికి అప్పగించాలని, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్‌టిఆర్‌కు టిడిపి పగ్గాలు అప్పగించాలని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. 2019లోనే చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయ్యిందని పార్వతి మండిపడ్డారు. పవన్‌తో చంద్రబాబు కాపు నాయకులను తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. విషవృక్ష నీడలో రాజకీయాలు చేయవద్దని పవన్‌కు లక్ష్మీ పార్వతి సూచించారు.

Also Read: ఎలుగుబంటిని చంపి… భర్త, సోదరుడిని కాపాడిన మహిళ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News