Sunday, April 28, 2024

ఈటల రాజేందర్ హత్యకు కుట్రః ఈటల జమున సంచలన ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను చంపేందుకు కుట్ర జరుగుతుందని ఆయన భార్య ఈటల జమున సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమాశంలో ఈటల జమున మాట్లాడుతూ.. ”ఈటల రాజేందర్ హత్యకు బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. ఈటల హత్యకు రూ.20కోట్లు ఖర్చు చేస్తానని కౌశిక్ రెడ్డి అన్నట్లు తెలిసింది.

మా కుటుంబానికి ఏం జరిగిన ముఖ్యమంత్రి కెసిఆర్‌దే బాధ్యత. ఈటల రాజేందర్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. తప్పుడు ప్రచారంతో కెసిఆర్ దగ్గర పదవి కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. సిఎం కెసిఆర్ మమ్మల్నీ ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు.హుజూరాబాద్ టికెట్ కౌశిక్ రెడ్డికి ప్రకటించిన తర్వాత అరాచకాలు ఎక్కువయ్యాయి.ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారన్నది అవాస్తవం. బిజెపిలో మే సంతృప్తికరంగా ఉన్నాం. బిజెపిలో ఈటలకు ప్రాధాన్యత లేదనేది అవాస్తవం. పదవుల కోసం ఈటల తలవంచరు” అని చెప్పారు.

Also Read: మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలిః సిఎం కెసిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News