Friday, May 3, 2024

ఎలుగుబంటిని చంపి… భర్త, సోదరుడిని కాపాడిన మహిళ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఓ మహిళ ఎలుగుబంటి దాడి నుంచి తన భర్త, సోదరుడిని కాపాడుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం హవేరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ముందాగాడ్ గ్రామంలో బిసిర్సాబ్ సావదట్టి(45), బశవన్ కట్టి, రజక్ నాలాబండ్ అనే ముగ్గురు తన పొలంలోని పని చేస్తుందడగా మూడు ఎలుగుబంట్లు వారిపై దాడి చేశాయి. దీంతో బసిర్సాబ్ గొడ్డలి తీసుకొని ఎలుగు బంటిపై దాడి చేసింది. అదే సమయంలో మరో రెండు ఎలుగుబంట్లపై భర్త, సోదరుడు రాళ్లతో దాడి చేయడంతో అవి పారిపోయాయి. గొడ్డలి దాడిలో తీవ్రంగా గాయపడిన ఎలుగుబంటి చనిపోయింది. ఎలుగుబంటి దాడిలో భర్త, సోదరుడు తీవ్రంగా గాయపడడంతో హబ్బళిలో ఉన్న కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also Read: విమానంలో సీటు పక్కనే మల విసర్జన: ప్రయాణికుడి అరెస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News