Wednesday, May 8, 2024

బావిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

మహబూబాబాద్: ప్రేమజంట బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాజుతండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజు తండా గ్రామంలోని వండ్ల తండాలో గుగులోతు వెంకటేష్(17), భూక్య ప్రవీణ(22) ప్రేమించుకుంటున్నారు. రెండు రోజుల నుంచి ఇద్దరు గ్రామంలో కనిపించకపోవడంతో గ్రామ శివారుల్లో వెతికిన వారి అచూకీ కనిపించలేదు. వండ్ల తండా శివారులో ఓ బావిలో ప్రేమ జంట మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇరు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News