Tuesday, May 7, 2024

కారాగారంలో స్పృహ కోల్పోయిన మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్ ముఖ్

- Advertisement -
- Advertisement -

 

Anil Deshmukh

ముంబై: ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు,  మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం కుప్పకూలినట్లు తెలిసింది. కుప్పకూలిపోయి ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే  జెజె ఆస్పత్రికి తరలించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్,  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తున్న అవినీతి ఆరోపణల కేసులో దేశ్‌ముఖ్ ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు.

ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తనపై వచ్చిన రూ.100 కోట్ల లంచం ఆరోపణలపై కేంద్ర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుండి తనను తొలగించిన తర్వాత సింగ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో, ముంబైలోని బార్‌లు,  రెస్టారెంట్ల నుండి నెలకు రూ. 100 కోట్లకు పైగా దోపిడీ చేయాలని దేశ్‌ముఖ్ తనను కోరినట్లు ఆరోపించారు. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద దేశ్‌ముఖ్‌, ఆయన వ్యక్తిగత సిబ్బంది సంజీవ్‌ పలాండే, కుందన్‌ షిండేలపై సిబిఐ ముంబైలోని ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దేశ్‌ముఖ్ గత 9 నెలలుగా ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. అతను నవంబర్ 1, 2021 న అరెస్టయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News