Thursday, May 2, 2024

మాజీ సిఎం ఫడ్నవీస్, రాజ్‌ఠాక్రేలకు భద్రతను తగ్గించిన ‘మహా’ సర్కార్

- Advertisement -
- Advertisement -

Maharashtra govt downgrades Devendra Fadnavis security

ముంబయి: మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వం పలువురు రాజకీయ నేతలకు కల్పిస్తున్న భద్రతలో మార్పులు చేసింది. మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎంఎన్‌ఎస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే, యుపి మాజీ గవర్నర్ రామ్‌నాయక్‌లకు భద్రతను తగ్గించింది. ఆ రాష్ట్ర బిజెపి చీఫ్ చంద్రకాంత్ పాటిల్‌కు ప్రభుత్వ భద్రతను తొలగించింది. ఉద్ధవ్ ప్రభుత్వ నిర్ణయం రాజకీయ కక్ష సాధింపు చర్యగా బిజెపి అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ వ్యాఖ్యానించారు.ఈ నెల 8న ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇద్దరు వ్యక్తుల భద్రత స్థాయిని పెంచగా, 11మందికి తగ్గించింది. 16 మందికి తొలగించింది, 13మందికి కొత్తగా కల్పించింది. ఫడ్నవీస్‌కు భద్రతను జెడ్ ప్లస్ స్థాయి నుంచి వై ప్లస్ విత్ ఎస్కార్ట్ స్థాయికి తగ్గించింది. రామ్‌నాయక్‌కు వై ప్లస్ నుంచి వైకి తగ్గించింది. రాజ్‌ఠాక్రేకు జెడ్ నుంచి వై ప్లస్ విత్ ఎస్కార్ట్ స్థాయికితగ్గించింది. సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌కు వై ప్లస్ విత్ ఎస్కార్ట్ నుంచి జెడ్ స్థాయికి, కాంగ్రెస్ నేత శతృఘ్నసిన్హాకు వై ప్లస్ నుంచి వై ప్లస్ విత్ ఎస్కార్ట్ స్థాయికి పెంచింది.

Maharashtra govt downgrades Devendra Fadnavis security

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News