Saturday, April 27, 2024

బాలీవుడ్‌లో రష్మిక జోరు..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అనడంలో సందేహం లేదు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. ఇంకా శర్వానంద్‌తో ఒక సినిమాను, తమిళంలో కార్తీతో మరో సినిమాను కూడా చేస్తోంది. ఈ ఏడాది సౌత్‌లో ఆమె అరడజనుకు పైగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోంది. ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో కూడా అడుగు పెడుతోంది. ప్రస్తుతం ఆమె సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ‘మిషన్ మజ్ను’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ ఏడాదిని బాలీవుడ్ సినిమాతో రష్మిక ప్రారంభించింది. మిషన్ మజ్ను సినిమాతో పాటు ఈ అమ్మడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ నటించబోతున్న ఒక సినిమాలో ఆయనకు కూతురిగా కూడా నటించేందుకు ఎంపికైంది. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సక్సెస్ అయితే బాలీవుడ్ నుండి ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వచ్చే అవకాశం లేకపోలేదు.

Rashmika to play Amitabh’s daughter role in Bollywood

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News