Friday, May 3, 2024

సిఎం భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

- Advertisement -
- Advertisement -

గద్వాల : గద్వాల నియోజకవర్గం ధరూర్ మ ండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాని కి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 12న సీఎం కేసీఆర్ గద్వాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయం,బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవాలకు వస్తున్నారన్నారు. అదే విధంగా మధ్యాహ్నం 3 గంటలకు గద్వాల జిల్లా కేంద్రంలోని అయిజ రోడ్ దగ్గర జరిగే భారీ బహిరంగ సభను 20వేలపై మందిని బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, ప్రజలు, రైతులు , మహిళలు, గ్రామ గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News