Wednesday, May 8, 2024

సుప్రీంలో గద్వాల ఎంఎల్‌ఎకు ఊరట…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌కు చెందిన గద్వాల ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నికల సంఘం, ప్రతివాదులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. డికె. అరుణను ఎంఎల్‌ఎగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటి ఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇసి ఆదేశాలు ఇచ్చింది.

ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని డికె. అరుణ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బ్యాంకు ఖాతాలు వెల్లడించకపోవడం తప్పేనని కృష్ణమోహన్‌రెడ్డి న్యాయవాది అంగీకరించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బిఆర్‌ఎస్ (టిఆర్‌ఎస్) అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ తరపున ప్రస్తుతం బిజెపిలో ఉన్న డికె అరుణ పోటీ చేశారు. కృష్ణమోహ న్‌రెడ్డికి 1,00,057, అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి. అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించారని, ఆయన ఎన్నికను రద్దు చేసి తనను ఎంఎల్‌ఎగా ప్రకటించాలని కోరుతూ ఆమో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News