Sunday, April 28, 2024

టిఎంసి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మమత

- Advertisement -
- Advertisement -

Mamata Banerjee announces candidates list 2021

కోల్‌కతా: త్వరలో జరుగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు టిఎంసి తన అభ్యర్థులను ప్రకటించింది. 291 స్థానాలకు సిఎం మమతా బెనర్జీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించారు. ఉత్తర బెంగాల్ లో 3 స్థానాల్లో టిఎంసి అభ్యర్థులను ప్రకటించింది. 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలకు పార్టీ టికెట్లు కేటాయించింది. ఈసారి జరిగే ఎన్నికల్లో 80ఏళ్ల పైబడిన వారికి మమత టికెట్లను నిరాకరించారు. దీదీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసి సువేందు అధికారి బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. సువెందు నందిగ్రామ్ నుంచి ఆయన బరిలోకి దిగతున్నట్లు బారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఈ సారి మమత, సువెందు అధికారి నందిగ్రామ్ నుంచి తలపడనున్నారు. బెంగాల్ లో ఎనిమిది విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

Mamata Banerjee announces candidates list 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News