Friday, May 3, 2024

పంత్ శతకం.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

Rishabh Pant Brings Up Third Test Century

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ చెలరేగిపోయి సెంచరీ చేశాడు. సిక్స్ తో పంత్ శతకం పూర్తి చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది మూడో శతకం. 115 బంతుల్లో రిషబ్ పంత్ ఈ ఫీట్ ను సాధించాడు. ఇందులో 2 సిక్సర్లు, 13 ఫోర్లు ఉన్నాయి. 259 పరుగుల వద్ద అండర్సన్ బౌలింగ్ లోనే రిషబ్ పంత్ (101) ఔటయ్యాడు. స్వదేశంలో పంత్ తొలి టెస్టు శతకం కావడం విశేషం. ప్రస్తుతం భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో పంత్ శతకంతో భారత్ మెరుగైన స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ నిలకడగా ఆడుతోంది. ఇప్పటికే టీమిండియా 54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. అయితే ఇంగ్లాండ్ ను భారత్ 205 పరుగులకే కట్టడి చేసింది.

Rishabh Pant Brings Up Third Test Century

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News