- Advertisement -
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 62 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఒక్కడే 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ డకౌట్ రూపంలో మైదానం వీడాడు. భారత బ్యాట్స్మెన్లలో ఛటేశ్వరా పుజారా(17), అజింక్య రహానే(27), రవీచంద్రన్ అశ్విన్(13) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (22), వాషింగ్టన్ సుందర్(01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్, జాక్ లీచ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
- Advertisement -