Saturday, April 27, 2024

బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

నల్గొండ : బైక్ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం నల్గొండ పట్టణ ంలో చోటుచేసుకు ంది. నల్గొండ వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.బొబ్బిలి నరేష్ (27 ) తండ్రి సైదులు వృత్తి రీత్యా బజాజ్ ఫైనాన్స్ లో రికవరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. మృతుని స్వస్థలం కట్ట వారి గూడెం గ్రామం చివ్వెంల మండలం. సూర్యాపేట జిల్లా. ఈనెల 20న స్నేహితులతో ధర్వేశిపురం వెళ్లి స్నేహితులతో పార్టీకి అటెండ్ అయ్యి,తిరుగు ప్రయాణంలో మునుగోడు రోడ్డు లో నియర్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద తాను నడుపుతున్న బైక్ అదుపుతప్పి, క్రింద పడటంతో తలకు బలమై గాయాలయాయి.అతని వెంట వస్తున్న స్నేహితులు గవర్నమెంట్ హాస్పటల్ కు చేశారు.అక్కడ సిటీ స్కాన్ తీసి సీరియస్ గా ఉందని చెప్పడంతో, ఐకాన్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. గురువారం మధ్యాహ్నం చనిపోయినట్టుగా డాక్టర్స్ తెలిపారు. చనిపోయిన వ్యక్తి యొక్క, అన్న పిటిషన్ పై కేసు నమోదు చేసి, పోస్టుమార్టానికి అప్పగించినట్టు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News