Monday, May 6, 2024

సెల్ టవర్ కు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

సెల్ టవర్ కు ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ మండలంలోని ఖానాపూర్ లో చోటుచేసుకుంది. గిరిరాజ్ ప్రభుత్వ కళాఖాలలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న నవీన్(35) అనే వ్యక్తి మంగళవారం ఉదయం సెల్ టవర్ ఎక్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతో బాధితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News