Wednesday, May 8, 2024

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

man killed in lightning strike in vikarabad

వికారాబాద్: పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందిన సంఘటన వికారాబాద్ మండల పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి…. మండల పరిధిలోని కొటాలగూడ గ్రామానికి చెందిన రాందాస్(38) శనివారం భార్య రాంభాయితో కలిసి పొలానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో అతనిపై పిడుగు పడగా అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న భార్య సొమ్మసిల్లి పడిపోయి వెంటనే తేరుకుని చూసే సరికి భర్త మృతి చెంది ఉన్నాడు. దీంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. వీరికి 10 సంవత్సరాల క్రితం వివాహాం జరిగింది. కానీ ఇప్పటికీ సంతానం లేదు. విషయం తెలిసిన సర్పంచ్ రాములునాయక్‌తో పాటు గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించించారు.

man killed in lightning strike in vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News