- Advertisement -
ముంబయి: ఓ వ్యక్తి ఆన్లైన్లో ల్యాప్టాప్ బుక్ చేస్తే రాళ్లు వచ్చిన సంఘటన మహారాష్ట్రాలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తాలవ్డే ప్రాంతంలో చిన్మయ్ గిరిష్ మధోల్కర్ అనే వ్యక్తి ఆన్లైన్లోని ప్రముఖ షాపింగ్ పోర్టల్ లో రూ.37,990లకు ఓ ల్యాప్టాప్ను బుక్ చేశాడు. మే 29 డెలవరీ బాయ్ పార్శల్ ఇచ్చి వెళ్లిపోయాడు. గిరిష్, ఆయన భార్య పార్శల్ను ఓపెన్ చేయగా అందులో రాళ్లు కనిపించడంతో బిక్కముఖం వేశారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆన్లైన్ పోర్టల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
- Advertisement -