Saturday, May 4, 2024

మనికా బాత్రా జోడీకి టైటిల్

- Advertisement -
- Advertisement -

Manika Batra and G. Sathiyan won mixed doubles title at WTT

 

బుడాపెస్ట్: ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూటిటి కంటెన్‌డర్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత జోడీ మనికా బాత్రా జి.సాతియన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టైటిల్‌ను సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో మనికా బాత్రా జోడీ 31తో హంగేరికి చెందిన డొరా మడార్‌సాజ్‌నండర్ ఎసెకి జంటను ఓడించింది. ఆరంభం నుంచే భారత జంట చెలరేగి ఆడింది. ప్రత్యర్థి జోడీపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ లక్షం దిశగా అడుగులు వేసింది. ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన భారత జంట 119, 911, 1210, 116తో జయకేతనం ఎగుర వేసింది. తొలి గేమ్‌లో భారత జట్టు విజయం సాధించింది. కానీ తర్వాతి గేమ్‌లో మాత్రం మనికా బాత్రా జంటకు ప్రత్యర్థి జోడీ షాక్ వచ్చిది. కానీ తర్వాతి రెండు గేమ్‌లలో గెలిచిన భారత జంట మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇదిలావుండగా టోక్యో ఒలింపిక్స్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన మనికా బాత్రాకు ఈ టైటిల్ పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఒలింపిక్ వైఫల్యంతో బాత్రాపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ప్రతిష్టాత్మకమైన డబ్లూటిటి టైటిల్ బాత్రా జోడీ విమర్శకులకు గట్టి సమాధానమే చెప్పింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News