Friday, April 26, 2024

సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా కస్టడీని ఢిల్లీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈ కేసులో కస్టోడియల్ ఇంటరాగేషన్ ముగియడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనను బుధవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టింది. దీంతో స్పెషల్ జడ్జి ఎంకె నాగ్‌పాల్ , సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 5 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యేక జడ్జి ఎంకె నాగ్‌పాల్ ఆదేశించారు.

ఇక సిసోడియాను ఈడీ వారం రోజులుగా తమ కస్టడీ లోకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు సిబిఐ విచారిస్తున్న లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనపై విచారణను మంగళవారం ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. బెయిల్ అభ్యర్థనపై శనివారం విచారణ జరగనుంది. ఫిబ్రవరి 26న విచారణ కోసం పిలిపించుకున్న సిబిఐ, ఢిల్లీ లోని ప్రధాన కార్యాలయం లోనే ఆయనను అరెస్టు చేయడం తెలిసిందే. ఇక మనీల్యాండరింగ్ అభియోగాలకు గాను ఈడీ, సిసోడియాను మార్చి 9 న తీహార్ జైలులో అరెస్టు చేయడం గమనార్హం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News