Thursday, May 2, 2024

తిరుపత్తూరులో రోడ్డుప్రమాదం: వైద్య విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

Medical student dies in Road accident at Tirupattur

తిరుపత్తూరు: తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరులో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో వైద్య విద్యార్థిని మృతిచెందింది. మరో ముగ్గురు మెడికోలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని తిరుపతికి చెందిన వైద్య విద్యార్థిని షణ్ముఖిగా గుర్తించారు. తమిళనాడులోని యాలగిరి హిల్స్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News