Thursday, May 2, 2024

అభిమానుల మృతిపై మెగా ఫ్యామిలీ తీవ్ర దిగ్భ్రాంతి..

- Advertisement -
- Advertisement -

Megastar Chiranjeevi Condolence to Mega Fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన సందర్భంగా భారీ ప్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మృతి చెందడంపై మెగా హీరోలు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, బన్నీ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వ‌కీల్ సాబ్ చిత్ర బృందం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూర్ లో పవన్ బ‌ర్త్‌డే కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు  అభిమానులు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు  ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వం అని చిరంజీవి త‌న పేర్కొన్నారు. రామ్ చరణ్, బన్నీ, దిల్ రాజుతోపాటు ప‌వ‌న్ 27వ సినిమాల నిర్మాత‌లు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ఒక్కొక్కరికి రూ. 2 ల‌క్ష‌లు చొప్పున ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించారు.

మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా, కుప్పంలో శాంతి పురం వద్ద 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు చనిపోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ‘ఇది మాటలకందని విషాదం’ అని తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. చనిపోయినవారిని తిరిగి తీసుకురాలేనని.. కానీ, వారి కుటుంబాలకు అర్థికంగా అండగా ఉంటానని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున జనసేన పార్టీ అర్థిక సాహాయం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News