Sunday, May 5, 2024

రాష్ట్రం రాక ముందు నీళ్ల కోసం అరిగోస పడ్డాం: గంగుల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : భారతదేశంలో సస్యశ్యామలంగా ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి పల్లెకు, గ్రామాలకు నాణ్యమైన త్రాగునీ రు సరఫరా చేయడం జరుగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం లోని ఎలగందల్ ఫిల్టర్ బెడ్ వద్ద నిర్వహించిన తెలంగాణ మంచినీళ్ల పండుగ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్య రాష్ట్రంలో నీళ్ల కోసం అరిగోస పడ్డామని, గోదావరి ప్రక్కనుండి పోయేదని కానీ తెలంగాణలో ఆగేది కాదని, బావులు, బోర్లు ఎండిపో యావని నీళ్ల కోసం మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి బిందె మీద బిందె పెట్టుకొని నీళ్లు తీసుకొని వచ్చే వారని నీళ్లు లేక, కరెంటు లేక ప్రజలు అరి గోస పడ్డారని అన్నారు.

రాష్ట్ర ఆవిర్బావానికి పూర్వo తెలంగాణలో ఎక్కడా చూసిన నెర్రలు బారిన చెరువులు, ఎండిపోయిన బావులు, నీటికోసం కిలోమిటర్ల కోద్ది దూరంపోయి నీళ్లను బిందేలలో ఎత్తుకొని వచ్చే పరీస్థితులు తెలంగాణాలో సాక్షత్కరించేవని అన్నారు. వర్షాకాలంలో కూడా అల్లంతదూరానా మానేరులో కనిపించే నీళ్లు, పంటపోలాలకు నీళ్లుపేట్టాలంటే లోఫేస్ కరెంటుతో నిత్యం కాళిపోతున్న ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లే కనిపించేవని, పంటకు నీరు అందించలేక ఎండిపోతున్న పంటను పశువులకు గ్రాసంగా అదించిన రోజులను చూశామన్నారు. తెలంగాణను ఆను కొని గోదావరి ప్రవహిస్తున్న, సింగరేణి బోగ్గు గనులు నిక్షేపంగా ఉన్న వాటిని ఏమాత్రం తెలంగాణా రాష్ట్ర అభివృద్దికి ఏమాత్రం వినియోగించబడలేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపేలా 2015 లో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిందని, అదే విధంగా ప్రధాన రిజర్వాయర్లలోని 19 నీటిని తోడే బావులు,

50 మంచినీటిని శుద్దిచేసే కేంద్రాలు, 2983 నీటిని తోడే పంపులు మరియు 56 వేల కిలో మీటర్ల ప్రధాన పైపులైన్లు ప్రధాన ట్యాంకులను నిర్మించుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, మున్సిపాలిటీలలో 135 లీటర్లు, కార్పోరేషన్ల పరిదిలో150 లీటర్ల నీటిని ప్రతి ఒక్కరికి అందించుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఆవిర్బావాని పూర్వం 17 వెల నీటి ట్యాంకులు, 10 వేల కి.మీ. అంతర్గత పైపులైన్లు మాత్రమే నిర్మిస్తే, మిషన్ భగీరథ పథకం ద్వారా 18,560 నీటి ట్యాంకులు, 67 వేల కి.మి. అంతర్గత పైపులైన్లను మరియు 57 లక్షల నల్లా కనెక్షన్లను నిర్మించుకొని, ఇటింటికి నీరందించుకోవడంతో 2022 లో నిత్య నీటి సరఫరాల చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవార్డ్ ను గెలుచుకొందన్నారు. గతంలో పంటను సాగుకు ముందు రైతు బ్యాంకు దగ్గర అప్పు తీసుకు వస్తే, సరైన నీరు లేక ఆరైతు అప్పును తీర్చపోవడంతో అప్పుకు అప్పుపెరిగి వడ్డికూడా కట్టలేని పరీస్థితులు ఎదురైతే,

ఆప్పులు ఇచ్చిన బ్యాంకులు మాత్రం ఆరైతు ఇంటి తలుపులు గుంజుకు పోవడం వంటివి చూసామని, అప్పుల పాలై రైతు ఆత్మహత్మ చేసుకుంటే అయ్యే అని అను కున్నామే తప్ప ఎటువంటి సహాయాన్ని ఎవరు అందించలేదన్నారు. ఇంటి ఆడబిడ్డ పెళ్లి బారమై అయినవాళ్లు, కానివాళ్ల దగ్గర అప్పులు తెచ్చి ఆస్థులు కుదువ పెట్టే రోజులు కనిపించేవని, చదువుకోవాలన్న ఆర్థిక పరీస్థితులు సహకరించక కూలీ పనులకు పోయో యువతను చూశామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతొ ఒక్కసారిగా పరీస్థితులు పూర్తిగా మారి పోయాయని, తిరిగి ఇవ్వనవసరం లేకుండా, పంటను సాగు చేసే ప్రతి రైతుకు రైతుబందును అందించుకుంటున్నామని, ఎదైన కారణంచేత రైతు మరణిస్తే ఆరైతు కుటుంబ ఆగం కాకుండా రైతుభీమాను అందించుకోవడం జరుగుతుందన్నారు. ఆడబిడ్డ పెళ్లి భారం కాకుండా ఉండేందుకు కళ్యాణలక్ష్మీ పథకాన్ని అందించామని, ఎక్కడా ఇప్పటి వరకు లేని విధంగా పుట్టబోయో బిడ్డ,

తల్లి ఆరోగ్యం బాగుండాలని ఉద్దేశంతో న్యూట్రిషన్ కిట్ లను అందించుకోవడం జరుగుతుందని తెలిపారు. కుల, మత, వర్గాలకు తావులేకుండా బావితరాలకు గుర్తుండిపోయోలా అందరం సంతోషంగా జరుపుకునే దశాబ్ది ఉత్సవాల పండుగను ఘనం గా నిర్వహించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ అమరేందర్, ఈఈ రామ్ కుమార్, డి ఏ ఓ నాగ సిద్దేశ్వర్, జిల్లా అటవీ శాఖ అధికారి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ రెడ్డవేణి మధు , కొత్తపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ రుద్రరాజు, యంపిపి లు టి.లక్ష్మయ్య, పిల్లి శ్రీలత, జెడ్ పి టి సి, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News