Sunday, April 28, 2024

గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపిన ఘనత సిఎం కెసిఆర్‌దే: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః స్వరాష్ట్రంలో మా తండాలో మా రాజ్యం కావాలనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందని ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. కుమరం భీమ్ పిలుపునిచ్చిన జల్, జంగల్, జమీన్ నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ అని బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మోడువారిన గిరిజనుల బతుకుల్లో మోదుగు పూల పరిమళాలు నింపారని కొనియాడారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ, గిరిజనులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News