Tuesday, April 30, 2024

మంత్రి జగదీష్ రెడ్డి ఔదార్యం

- Advertisement -
- Advertisement -

 

సమస్యల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో సూర్యాపేట శాసన సభ్యులు, విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. సమస్యల పై తనను నేరుగా కలిసినవారికే కాదు, ఆయన దృష్టికి వచ్చిన వారికి చేయూతని అందించారు. తాజాగా మరోసారి జగదీష్ రెడ్డి ఆర్టీసి చిరుద్యోగి పట్ల తన మానవత్వాన్ని చాటిచెప్పారు.

సూర్యాపేట కు చెందిన లతీఫ్ ఆర్టీసి డిపో లో శ్రామిక్ గా విధులు నిర్వహించేవారు. ఉద్యోగం చేసుకుని భార్య పిల్లల తో సంసారం వెళ్లదీస్తున్న లతీఫ్ కుటుంబాన్ని విధి వంచించడం తో రోడ్డు ప్రమాదం లో తన కాలు ను శాశ్వతంగా కోల్పోయాడు. దీంతో చాలా కాలం గా ఉద్యోగానికి దూరం అవడం తో పాటు , ఆర్టీసి లో శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయే పరిస్తితి వచ్చింది. ఆర్టీసి అధికారులు కూడా తిరిగి విధుల్లో చేర్చుకోవడానికి ససేమిరా అన్నారు.

కుటుంభం కూడా గడవడం కష్ట తరంగా ఉన్న నేపథ్యం లో తన దీన పరిస్థితి నీ మంత్రి జగదీష్ రెడ్డి విన్నవించుకోవడానికి సూర్యాపేట క్యాంపు ఆఫీసు కు వచ్చిన లతీఫ్ ను గమనించిన మంత్రి , నేరుగా అయన వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నాడు.. లతీఫ్ పరిస్తితి కి చలించిన మంత్రి నేరుగా అక్కడిక్కడే రాష్ట్ర ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తో మాట్లాడి లతీఫ్ ను ఉద్యోగం లో కొనసాగించాలని సిఫార్స్ చేశారు .

అంతటి తో ఆగకుండా లతీఫ్ ను చైర్మన్ కు కల్పించే బాధ్యత ను వ్యక్తి గత సిబ్బంది కి అప్పజెప్పారు. మంత్రి సిఫార్స్ తో ఆర్టీసి చైర్మన్ ను కలిసిన లతీఫ్ నేడో రేపో ఉద్యోగం లో చేరనున్నాడు. దీంతో లతీఫ్ తో పాటు అయన కుటుంభ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. నాయకుడంటే జగదీష్ రెడ్డి లా ఉండాలని , తమ పై అయన చూపిన ఔదార్యానికి రుణ పడి ఉంటామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News