Monday, April 29, 2024

చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత సీఎం కేసీఆర్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.నేతన్న ఇంట్లో వి ద్యాబుద్ధులు నేర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మరమగ్గల చప్పుడే కాదు నేతన్నల గుండె చప్పుడు బాగా తెలుసు అన్నారు.జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని భూదాన్ పోచంపల్లిలో జరుగుతున్న వారోత్సవాలలో సహచర రాష్ట్ర ఐటి మరియు పురపాలక,చేనేత జౌళి శాఖామంత్రి కలువకుంట్ల తారకరామారావుతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నేతన్నల గుండె చప్పుడు తెలిసి నందునే ఉద్యమ కాలంలోనే ఉద్యమ నాయకుడిగా నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు భూదాన్ పోచంపల్లి,సిరిసిల్లలో పర్యటించి చేనేత కార్మికులను ఆదుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఆదరణ,గుర్తింపు లేక పోవడంతో ఆత్మాభిమానంతో అప్పులు చెయ్యలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కలత చెందిన ము ఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఉద్యమ నాయకుడిగా జోలె పట్టుకుని వసూలు చేసిన మొత్తలతో చేనేత కార్మికులకు అండగా నిలిచిన సందర్భాన్ని ఆయన గుర్తుచేశారు.

అందుకే అధికారంలోకి వచ్చిందే తడవుగా సమస్యను సత్వరమే అర్థం చేసుకోగలిగిన కలువకుంట్ల తారకరామారావు ను చేనేత జౌళిశాఖ మంత్రిగా నియమించారన్నారు.మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఎటు చూసినా కనిపించేది చేనేత కార్మికులే అయినందున ఈనాడు చేనేతలు ఇంతటి పురోగతి సాదించారన్నారు.నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఆయన మద్దతుతో కేంద్రంలో కొలువుదీరిన ఎన్ డి ఏ,ఆ తరువాత అధికారంలోకి వచ్చిన యూపీఏ -1,2ప్రభుత్వాలు చేనేత కార్మికులను వారి ఆత్మాభిమానాలను గుర్తించ లేక పోయారని ఆయన దుయ్యబట్టారు.

భువనగిరి శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ ఉత్సవాలలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,రవీంద్ర నాయక్,చిరుమర్తి లింగయ్య, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, అందేలా లింగయ్య యాదవ్, కుంభం అనీల్ కుమార్ రెడ్డి, జనగాం పాండు, ర్యాకల శ్రీనివాస్, సిలివేరు మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News