Sunday, April 28, 2024

ప్రజల వద్దకు ప్రజా పాలన తెచ్చాం: మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

జుక్కల్ : కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం బీచ్కుందా మండలం రాజారాం తండాలో ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావుతో కలిసి ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు దరఖాస్తులు స్వీకరించారు. అంతకుముందు చారిత్రాత్మక కౌలాస్ కోటను జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన కౌలాస్ కోటను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి, నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌలాస్ కోట అభివృద్ధిపై త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని మంత్రి జూపల్లి ఆరోపించారు. పదేళ్ల పాలనలో గ్రామాలు, తండాల్లో సౌకర్యాలు లేవు, అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ఎల్లారం తాండాకు ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఎంపీ వచ్చినా దాఖలాలు లేవన్న ఆయన రెవెన్యూ శివారు లేదు, గూగుల్ మ్యాప్ లో ఈ తాండ పేరు లేదని ప్రజలు అంటున్నారని తెలిపారు. ఇదీ బిఆర్ఎస్ పాలనలో పరిస్థితన్నారు. ఇవ్వన్ని చూసే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని చెప్పుకొచ్చారు.

ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా… ప్రజల వద్దకు ప్రజా పాలన తెచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రెండు హామీలను అమలు చేశారని వెల్లడించారు. ఆరు గ్యారంటీల అమలుకే ప్రజా పాలనలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం.. దశల వారీగా మిగితా హామీలను అమలు చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News