Sunday, April 28, 2024

రేపు రామగుండంలో మంత్రి కెటిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోలీసు కమిషనరేట్ ప్రారంభం నేపథ్యంలో నేడు రామగుండానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుడం నియోజకవర్గంలో కెటిఆర్ పర్యటించనున్నారు. రాష్ట్ర పోలీసు హౌసింగ్‌బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సహకారంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీసు కమిషనరేట్ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. గోదావరిఖని, రామగుండంల మధ్య పోలీసు హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో 29 ఎకరాల స్థలంలో 59 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలంగా దీనిని నిర్మించారు.

Also Read: 15 మంది సర్పంచులకు మావోయిస్టుల హెచ్చరిక

తొలుత మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పర్యటించనున్న మంత్రి ఆ తర్వాత మధ్యాహ్నం 2:45 గంటలకు హెలికాప్టర్‌లో గోదావరిఖనికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రామగుండం కమిషనరేట్‌ను ప్రారంభించిన అనంతరం కెటిఆర్ పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసేలా నిర్మించిన ఫైలాన్‌ను మంత్రి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి కెటిఆర్ హైదరాబాద్‌కు వస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News