Saturday, April 27, 2024

ఐ సెట్ దరఖాస్తులకు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 12వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ వరలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తొలుత ఈ నెల 6వ తేదీ వరకు గడువుకు చివరి తేదీగా ఉంది. కాగా ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు స్పష్టం చేశారు. రూ. 250 అలస్య రుసుంతో ఈ నెల 15వ తేదీ వరకు,

రూ. 500 లేట్ ఫీజుతో ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా ఈ నెల 26,27 తేదీల్లో ఎంట్రన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఐ సెట్ కన్వీనర్ వరలక్ష్మి తెలిపారు. ఈ పరీక్షను 20 ఆన్‌లైన్ ప్రాంతీయ కేంద్రాల్లో 75 సెంటర్లలో నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని 16, ఆంధ్రప్రదేశ్‌లో మరో 4 కేంద్రాలు ఉన్నాయి. నాలుగు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు కన్వీనర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News