Sunday, April 28, 2024

బిజెపిపై వంటింటి నుంచే విప్లవం

- Advertisement -
- Advertisement -

మోడీకి ఆయిల్ కంపెనీల నష్టాలే తప్ప..
ఆడబిడ్డల కష్టాలు కనిపించవా?

కార్పొరేట్లపై ఉన్న కరుణ సామాన్యులపై లేదెందుకు? చమురు
సంస్థలకు రూ.22వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం ఆడపడుచులపై
రూ.42వేల కోట్ల భారం మోపింది సిలిండర్ ధరను మూడు రేట్లు పెంచి సబ్సిడీకి మంగళం
పాడిన బిజెపిని తరిమికొట్టాలి మహిళలకు మంత్రి కెటిఆర్ పిలుపు కేంద్రం వైఖరిపై ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడబిడ్డలపై మోపిన రూ.42 వేల కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్ భారానికి వెంటనే తగిన పరిహారం చెల్లించాలని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలతో ఆ యిల్ కంపెనీలకు నష్టం వస్తుందంటూ రూ.22వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని తాజా గా ప్రకటించిన ప్రధాని మోడీ.. గా సబ్సిడీ ఎత్తేసి, గ్యాస్ సిలిండర్ ధరను పెంచి ఆడబిడ్డలపై మోపిన ఆర్థిక భారానికి ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వరని ఆయన నిలదీశారు. బడాబాబులు, వ్యా పార వేత్తలకు సర్వం దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడుతున్నాయన్నారు.

బిజెపి పతనం వంటింట్లో నుంచి మొదలవుతుందన్నారు. ప్రధానమంత్రి కాకముందు సుమారు రూ. 400 సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1100లకు దాటి పరుగులు తీస్తున్నదని కెటిఆర్ విమర్శించారు. 2014లో కేం ద్రం ఒక్క సిలిండర్‌పై పై గా సబ్సిడీ ఇచ్చేదన్న ఆయన, మోడీ పరిపాలనలో ఈరోజు సబ్సిడీ గుండుసున్నా గా మారిందన్నారు. మోడీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా 170శాతం గ్యాస్‌బండ రేట్లు పెంచి సబ్సిడీని సంపూర్ణంగా రద్దు చేసిందని విమర్శించారు. గ త రెండు సంవత్సరాల్లోనే సుమారు రూ. 42 వేల కోట్లకు పైగా సబ్సిడీ భారాన్ని సామాన్య జనంపైకి కేంద్రం నెట్టిందని ధ్వజమెత్తారు. పేదలపై ఆర్థ్ధిక భారం మో పిన మోడీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల కు మాత్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించ డం శోచనీయమని మండిపడ్డారు. మోడీ పాలన, బిజెపి ధ్యాసంతా బడాబాబులు, వ్యాపారవేత్తల పైనేనని మరోసారి నిరూపితం అయిందన్నారు. ముందు కేవలం నాలుగు వందల సిలిండర్ ధర ఉంటేనే అప్పటి ప్రధానిపైన విమర్శలు చేసిన మోడీ…. ఇప్పుడు దేశ ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యధిక ధరకు సిలిండర్‌ను దేశ ప్రజలకు అమ్ముతున్న ఘనత మన మోడీకే దక్కిందని ఆయన ఎద్దేవా చేశారు. సిలిండర్ ధరల పెంపు విషయంలో ఆయన విశ్వగురువుగా నిలిచారని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యంగ్యస్త్రాలను సంధించారు.

2.11 కోట్ల మంది వినియోగదారులు గ్యాస్‌కు దూరమమయ్యారు

అసమర్థ బిజెపి పాలనలో సుమారు 2.11 కోట్ల మంది వినియోగదారులు గ్యాస్‌కు దూరమయ్యారని కెటిఆర్ పేర్కొన్నారు. అడ్డగోలుగా పెరిగిన సిలిండర్ ధరతో కనీసం ఒక్క సిలిండర్ కూడా తీసుకోలేకపోతున్నారన్నారు. దేశంలో ఉన్న 39 కోట్ల గ్యాస్ కనెక్షన్‌దారులపై గత సంవత్సరంలోనే రూ.42 వేల కోట్ల సబ్సిడీ భారాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోపిందన్నారు. దురదృష్టవశాత్తు గత రెండు సంవత్సరాలు కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌తో మధ్యతరగతి ప్రజల ఆదాయాలు భారీగా తగ్గినా మోడీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. పైగా ధరలను పెంచి ఆయా వర్గాలను దోచుకోవడాన్ని కేంద్రం ఆపలేదని ధ్వజమెత్తారు.

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్యపు పాలన

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్యపు బిజెపి పాలనలో ధరలు దండయాత్ర చేస్తున్నాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇది ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగిన నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం….. అలాంటి సమాంతర ప్యాకేజీ లేదా సబ్సిడీని సిలిండర్ వినియోగదారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బడా కంపెనీలపై ఉన్న ప్రేమ….సామాన్య ప్రజలపై మోడీకి ఎందుకు లేదన్నారు. దీనిపై ఆ పార్టీ నేతలు ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. కార్పోరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెట్టడమే ఆశయంగా మార్చుకున్న బిజెపికి ఆయిల్ కంపెనీల నష్టాలే తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించడం లేదా? అని కెటిఆర్ మండిపడ్డారు. అడ్డగోలుగా పెంచిన సిలిండర్ ధరలు, అడ్డూఅదుపు లేని పెట్రో ధరలతో పాటు ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో దేశ ప్రజలకు మోడీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం నరకం చూపిస్తోందని విమర్శించారు.

వంటింట్లో నుంచి బిజెపి పతనం షూరూ అవ్వాలి

నరేంద్ర మోడీ అసమర్ధ విధానాలను అర్థం చేసుకున్న దేశ మహిళలోకం మోయలేని భారం మోపే వాడే మోడీ అని బలంగా నమ్ముతున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. మోడీ కావాలో? సబ్సిడీ కావాలో? దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన తరుణం ఇదేనని అన్నారు. గ్యాస్ బండ పైన సబ్సిడీ అడిగితే ఏడాదికి మూడు సిలిండర్లు సరిపోవా? అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెక్కరించినట్లు మాట్లాడడం మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా మహిళ లోకంపై బిజెపికి ఉన్న చులకన భావానికి అద్దం పడుతుందని విమర్శించారు. దేశ జనాభాలో సగం ఉన్న మహిళలు తలచుకుంటే బిజెపి ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయన్నారు. గ్యాస్ భారాన్ని ధరల భారాన్ని ఇంకా భరించలేమంటూ బిజెపి ఘోరాలను ఇక సహించమంటూ మహిళలు తీర్మానం చేయాలని ఈ సందర్భంగా కెటిఆర్ పిలుపునిచ్చారు. బీహార్ నుంచో.. బెంగాల్ నుంచో కాదు..పేద మధ్యతరగతి మహిళల ‘వంటింట్లో నుంచే బిజెపి పతనం‘ షురూ కావాలన్నారు. భారతీయ జనతా పార్టీ అంటేనే భారం అంతా జనంపై మోపే పార్టీగా మారిందని విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News