Tuesday, April 30, 2024

ఆదిత్య మిట్టల్‌తో మంత్రి కెటిఆర్ భేటీ

- Advertisement -
- Advertisement -

Minister KTR meets Aditya Mittal

తెలంగాణలో పెట్టుబడుల అవకాశాల గురించి చర్చ

ట్విట్టర్ ద్వారా తెలియజేసిన కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ఒకప్పుడు మిట్టల్ స్టీల్స్‌గా విశ్వవిఖ్యాతి పొందిన ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ సిఇఒ ఆదిత్య మిట్టల్ హై దరాబాద్ పర్యటనకు వచ్చారు. మిట్టల్ స్టీల్స్ వ్యవస్థాపకుడు లక్ష్మీ మిట్టల్ కుమారుడైన ఆదిత్య ఇటీవలే ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ సిఇఒగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి విదితమే. హైదరాబాద్ వచ్చిన ఆదిత్య మిట్టల్‌తో మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు. విషయా న్ని స్వయంగా కెటిఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. హైదరాబాద్ అల్లుడు కూడా అ యిన ఆదిత్య మిట్టల్‌తో భేటీ అయ్యానని, తెలంగాణలో ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ పెట్టుబడులు గురించి చర్చించానని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News