Wednesday, May 15, 2024

నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలోని అత్తపూర్ సమీపంలో ఉన్న కినార గ్రాండ్‌లో శనివారం మంత్రి సత్యవతి రాథోడ్… పిఎస్ రవీందర్ కుమారుడి వివాహానికి ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై నూతన వధూవరులైన మానస్ కుమార్, రేవతిలను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్త్, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖల కార్యదర్శి భారతి హోలీకేరి, గురుకుల విద్యాసంస్థ్ల సొసైటీ కార్యదర్శి నికోల్స్, అడిషన్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్ది, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్, జిసిసి చైర్మన్ వాల్యానాయక్, ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News