Thursday, May 2, 2024

షర్మిల దీక్షకు ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం

- Advertisement -
- Advertisement -

MLA Komatireddy Rajagopal Reddy is in solidarity with Sharmila Deeksha

 

మనతెలంగాణ/హైదరాబాద్: నల్గొండ జిల్లా చండూరు మండలంలోని పుల్లెంలలో వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్ష కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న ఆయన షర్మిలకు ఫోన్ చేశారు. ఆమెకు తన మద్దతును ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ సమస్యలపై పోరాడేవారికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. నిరుద్యోగుల కోసం షర్మిల చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని కోమటిరెడ్డి ఆకాంక్షించారు. నిరుద్యోగులను ముఖ్యమంత్రి కెసిఆర్ దారుణంగా మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వడాన్ని మానేసి సొంత కుటుంబం కోసం ఆలోచిస్తున్నారని అన్నారు. రాజన్న బిడ్డగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టడం సంతోషకరమని చెప్పారు. ఆమెకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News