Sunday, April 28, 2024

గంట కరెంట్‌తో ఎకరానికి నీరు పారించు రేవంత్: క్రాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారని ఎంఎల్‌ఎ క్రాంతి కిరణ్ ఎద్దేవా చేశారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై క్రాంతి చురకలంటించారు. ఉచిత విద్యుత్‌తో రైతులకు వ్యవసాయంపై భరోసా కలిగిందని, కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన అండతో రైతులు అద్భుతంగా పంటలు పండిస్తున్నారని క్రాంతి ప్రశంసించారు. రేవంత్ అవాకులు చెవాకులు పేలుతున్నారని, దమ్ముంటే గంట కరెంట్‌తో ఎకరానికి నీరు పారించి చూపించాలని సవాల్ విసిరారు.

Also Read: పాతబస్తీలో ఐదు స్టేషన్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News